Nehwal becomes first Indian to reach semi-final
సెమీస్కు చేరిన సైనా
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్లో కొత్త చరిత్ర సృష్టించింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న సైనా సెమీఫైనల్ చేరి పతకంపై ఆశల్ని సజీవంగా నిలిపింది. తద్వారా ఒలింపిక్స్లో సెమీస్ చేరిన ఏకైక భారతీయురాలిగా రికార్డు పుటల్లోకి చేరింది. ఇక ఓ విజయం సాధిస్తే స్వర్ణం లేదా రజతం సైనా ఖాతాలో చేరిపోతుంది. ఒకవేళ సెమీస్లో ఓడితే కాంస్య పతక పోరులో నెగ్గాల్సి ఉంటుంది. ఓ అడుగు ముందుకువేస్తే సైనా పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వెంబ్లీ ఎరెనాలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగోసీడ్ సైనా 21-15, 22-20తో వరల్డ్ ఏడో ర్యాంకర్, ఏడోసీడ్ టిన్ బాన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది.
ప్రపంచ నంబర్వన్ యిహాన్ వాంగ్తో సెమీస్ నేడు
సెమీఫైనల్స్ మధ్యాహ్నం గం. 1.30 నుంచి
Nehwal becomes first Indian to reach semi-final | Saina Nehwal of India dispatched Tina Baun of Denmark 21-15, 22-20 to reach the semi-final of the women’s singles badminton event.











